రూమర్లకు చెక్ పెట్టిన గోపీచంద్
Tuesday,June 12,2018 - 02:55 by Z_CLU
గోపీచంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పంతం’ రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా అందరి అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే టాలీవుడ్ లో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. జూలై 5 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, మ్యాగ్జిమం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెట్టేశాడు గోపీచంద్.
గోపీచంద్ ‘పంతం’ రిలీజ్ డేట్ లో ఏ మాత్రం చేంజ్ లేదు. రీసెంట్ గా U.K లో లాస్ట్ షెడ్యూల్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.
K. చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. K.K. రాధా మోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.