"గతం" ట్రయిలర్.. తెరపైకి మరో థ్రిల్లర్

Saturday,February 22,2020 - 01:27 by Z_CLU

విభిన్న కథాంశంతో తెలుగు తెరపై రాబోతున్న చిత్రం గతం. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వారిద్దరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారనే లైన్ తో కిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను అడవి శేషు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు.

“జస్ట్ ఇమాజిన్ … లైఫ్ రీస్టార్ట్ అయితే… అంటూ ఆసక్తికరమైన డైలాగ్ తో మొదలైంది గతం ట్రైలర్. భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు నిర్మించారు.

పూర్తి స్థాయిలో అమెరికాలో 3 నెలల పాటు ఎముకలు కొరికే చలిలో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.