'గ్యాంగ్ లీడర్' కాంబో ఎన్నాళ్ళకో

Sunday,January 05,2020 - 09:50 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఇద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసినా అందులో ‘గ్యాంగ్ లీడర్’ మాత్రం ఫ్యాన్స్ కి స్పెషల్ మూవీ అనే చెప్పాలి. సినిమాలో తమ కెమిస్ట్రీతో అదరగొట్టేసారు చిరు -విజయ్ శాంతి. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ  కాంబో ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్ కి అప్పటి రోజులు గుర్తుచేయబోతున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు గ్రాండ్ గా జరబోతుంది. ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా మెగా స్టార్ ఎటెండ్ అవుతున్నారు. ఇక ఇదే సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సో సాయంత్రం జరగనున్న ఈ ఈవెంట్ లో చిరు -విజయ్ శాంతి కాంబో స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వనుంది. మరి రాములమ్మ గురించి చిరు ఏం మాట్లాడతాడో.. చిరు మాటలకు బదులుగా రామలమ్మ ఎలాంటి స్పీచ్ ఇస్తుందో.. అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక  మహేష్ హోస్ట్ చేయనుండటం కూడా ఈవెంట్ కి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వనుంది.