'గేమ్ ఓవర్' అంటున్న తాప్సి

Sunday,May 26,2019 - 03:21 by Z_CLU

తాప్సి మెయిల్ లీడ్ లో ‘వై నాట్ స్థూడియోస్’ బ్యానర్ పై నిర్మించిన చిత్రం గేమ్ ఓవర్. ఈ చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది.  ప్రపంచవ్యాప్తంగా జూన్ 14 న సినిమాను విడుదల చేయబోతున్నారు.

శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా ‘వై నాట్ స్థూడియోస్’ బ్యానర్ పై గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలొచ్చాయి. గేమ్ ఓవర్ కూడా కచ్చితంగా ఆకట్టుకుంటుందంటున్నారు నిర్మాతలు.

‘నయనతార’ కథానాయికగా తమిళనాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం రూపొందింది.