'ఉన్నది ఒకటే జిందగీ' సింగిల్ రిలీజ్

Sunday,August 06,2017 - 10:15 by Z_CLU

రామ్ నయా మూవీ ఉన్నది ఒకటే జిందగీ. ఈమధ్యే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశాడు రామ్. ఈరోజు ఏకంగా సింగిల్ రిలీజ్ చేశాడు. ఫ్రెండ్ షిప్ డే కానుకగా సినిమాలో ఫ్రెండ్ షిప్ సాంగ్ ను రిలీజ్ చేశాడు. ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడు అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేశాడు. కేవలం బాణీలు అందించడమే కాదు, ఈ పాట పాడింది కూడా మన రాక్ స్టారే. చంద్రబోస్ ఈ పాట రాశాడు.

స్రవంతి సినిమాటిక్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ ను ఇలా ఫ్రెండ్ షిప్ యాంథెమ్ తో స్టార్ట్ చేసింది యూనిట్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.