జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న 'ఫిదా'

Wednesday,July 05,2017 - 03:00 by Z_CLU

మెగా హీరో వ‌రుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో దిల్‌రాజు నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ ‘ఫిదా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులై 21 న థియేటర్స్ లోకి రాబోతుంది .

లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై అంచనాలను నెలకొల్పాయి. ఇటీవలే శక్తి కాంత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘వచ్చిండే’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో హంగామా చేస్తూ సినిమా పై హైప్ తీసుకొచ్చింది.

జులై 10న ఆడియోను రిలీజ్ చేసి జూలై 21న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో..చూడాలి.