ఫ్యాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్...

Thursday,October 06,2016 - 05:58 by Z_CLU

టాలీవుడ్ లో కొన్ని కథలు చాలా మంది హీరోల దగ్గర తిరుగుతూ ఫైనల్ గా ఓ హీరోకు ఫిక్స్ అవుతాయి. దీనికి చాలా సినిమాలే ఉదాహరణ.. అయితే తాజాగా ఓ కథ ఇద్దరి ముగ్గురి దగ్గర తిరిగి ఫైనల్ గా ఓ కుర్ర హీరో చేతిలో పడింది. ఆ కథ లేడీస్ టైలర్ కు సీక్వెల్ అయితే.. వార్తల్లోకెక్కిన ఆ హీరో సుమంత్ అశ్విన్.

వివరాల్లోకెళితే సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీస్ టైలర్ చిత్రం అప్పట్లో ఎంత విజయం సాధించిందో? తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ చేసుకున్నాడు వంశీ. ఈ కథను ముందుగా

ledies-tailor-still

   రవితేజ తో తెరకెక్కించాలనుకున్నాడు. అయితే  అది వర్కవుట్ కాకపోవడంతో.. రాజ్ తరుణ్ ను హీరోగా ఎనౌన్స్ చేశారు. మళ్ళీ కొన్ని రోజులకి రాజ్ తరుణ్ కూడా తప్పుకున్నాడంటూ వార్తలు రావడంతో.. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఆ సీక్వెల్ తో హీరో గా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లుకొట్టింది. ఇప్పుడు తాజాగా సుమంత్ అశ్విన్ దగ్గరకి వచ్చి ఆగింది. ఈసారైనా ఈ కథ ఈ హీరో కి ఫిక్స్ అవుతుందో? లేదో చూడాలి…