ఫిబ్రవరి 12న 'ఎఫ్సీయూకే'
Monday,January 18,2021 - 05:06 by Z_CLU
జగపతిబాబు ప్రధాన పాత్రలో, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా తెరకెక్కిన ‘ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. విద్యాసాగర్ రాజు దర్శకుడిగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్నఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. లాక్ డౌన్ కంటే ముందే సినిమా షూటింగ్ పూర్తయిందని 2020 ఏప్రిల్ లో రిలీజ్ అనుకొని లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్నామని నిర్మాత తెలిపారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా జీవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విద్యా సాగర్ డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదిత్య, కరుణాకర్ మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.