ఎక్స్ క్లూజీవ్ : మైత్రి నెక్స్ట్ సినిమాకు టైటిల్ ఫిక్స్ !

Sunday,February 17,2019 - 11:50 by Z_CLU

వరుసగా బడా సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుండి ఇకపై చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రానున్నాయి. ప్రస్తుతం చిన్న బడ్జెట్ తో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను నిర్మిస్తున్నారు మైత్రి నిర్మాతలు. సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు సింహ కోడూరిని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిన్న సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘మత్తు వదలరా’ అనే టైటిల్ ను  ఫిక్స్ చేసారని సమాచారం.

రితేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. యంగ్ టీంతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.