ఎక్స్ క్లూజీవ్ : 'ఆల్ ఈజ్ వెల్' అంటున్న సతీష్ వేగేశ్న

Monday,January 28,2019 - 06:28 by Z_CLU

‘శతమానం భవతి ‘తో నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటివలే ఖాకీ సినిమాను తెలుగులో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది.

ఈ సినిమా సతీష్ వేగేశ్న స్టైల్లోనే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఓ యంగ్ హీరోని  లాక్ చేసుకొనే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి అతిత్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.