సెప్టెంబర్ 12న `ఎందుకో ఏమో` విడుదల

Saturday,September 01,2018 - 10:21 by Z_CLU

మ‌హేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి హీరోహీరోయిన్లుగా కోటి వ‌ద్దినేని ద‌ర్శ‌కత్వంలో మాల‌తి వ‌ద్దినేని నిర్మిస్తోన్న చిత్రం `ఎందుకో ఏమో`. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమా పై మంచి క్రేజ్ ని ఏర్పరిచాయి. అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది.

ఈ సందర్భం గా దర్శకుడు కోటి వ‌ద్దినేని మాట్లాడుతూ…“ ఎందుకో ఎమో` సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నా. నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది“ అన్నారు.

నిర్మాత మాల‌తి వ‌ద్దినేని మాట్లాడుతూ…“ మ‌హేశ్వ‌ర క్ర్రియేష‌న్స్ ప‌తాకంపై ఇది మా తొలి సినిమా. వినాయ‌క్ గారి చేతుల మీదుగా విడుదలైన టీజర్ కు, బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా రిలీజ్ అయినా పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తోంది.“ అన్నారు.