దొరసాని ప్రమోషన్ స్టార్ట్

Monday,April 01,2019 - 11:51 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే ఊపులో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడా మూవీకి ఓ పేరుపెట్టి, ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న సినిమాకు దొరసాని అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఎప్పట్నుంచో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే టైటిల్ తో లోగో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమౌతోంది.

బిగ్ బెన్ మూవీస్, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది దొరసాని. తాజాగా ఈ ప్రాజెక్టులోకి సురేష్ బాబు కూడా సహనిర్మాతగా ఎంటరయ్యారు. తెలంగాణలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తం తెలంగాణలోనే చిత్రీకరించారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ వరంగల్ లో పూర్తయింది.