Radheshyam వాయిస్ ఓవర్ ఎవరంటే ?

Saturday,February 26,2022 - 03:56 by Z_CLU

Director Radhakrishna gives clarity on ‘Radheshyam’s Voice over

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ మార్చ్ 11న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు. హిందీలో బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు మేకర్స్. కానీ  తెలుగు వర్షన్ కి ఏ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తారా ? అనేది హాట్ టాపిక్ అవుతుంది.

సోషల్ మీడియాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఒక స్పెషల్ పర్సన్ తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం అంటూ చెప్పుకున్నాడు. కానీ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అనే న్యూస్ లో మాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశాడు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ అండ్ టీం జక్కన్న తో వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా చెప్పనున్నారని అంటున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే ప్రభాస్ సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ అనే ఆసక్తితో ఉన్న ఫ్యాన్స్ కాస్త నిరాశ పడే అవకాశం ఉంది.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics