సినిమా హిట్ చేసినందుకు థ్యాంక్స్ - కిషోర్ తిరుమల

Tuesday,October 31,2017 - 06:30 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. అనుపమ, లావణ్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. మూవీని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నాడు.

“ఎమోషనల్ డైలాగ్స్ వచ్చిన ప్రతిసారి యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ ఎమోషనల్ డైలాగ్ వచ్చినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. విజిల్స్ పడుతున్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్స్.”

ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన శ్రీవిష్ణు, కీలకపాత్ర పోషించిన అనుపమ పరమేశ్వరన్ కు ఈ సందర్భంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు కిషోర్ తిరుమల. ఇప్పటికీ తనను ఎవరు కలిసినా ఈ రెండు క్యారెక్టర్ల గురించే మాట్లాడుతున్నారని.. నేను రాసిన డైలాగ్స్ ను తిరిగి నాకే చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు.