నైజామ్ లో ‘శరభ’ మూవీని రిలీజ్ చేయనున్న దిల్ రాజు

Friday,January 12,2018 - 04:59 by Z_CLU

ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా అదే స్పీడ్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన దిల్ రాజు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ఆకాశ్ కుమార్, మిష్టి చక్రవర్తి జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘శరభ’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో కూడా అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయింది.

జయప్రద కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. భారీ ఎత్తున గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని నైజామ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నాడు దిల్ రాజు. S. నరసింహా రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘శరభ’ కి అశ్విని కుమార్ సహదేవ్ ప్రొడ్యూసర్. కోటి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనుంది సినిమా యూనిట్.