దిల్ రాజు – ఈసారి మాత్రం పక్కా...

Thursday,July 04,2019 - 10:02 by Z_CLU

చాలా రోజుల నుండి బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. నిజానికి కమలహాసన్ ‘ఇండియన్ 2’ తోనే అది జరిగిపోవాలి. కాకపోతే దిల్ రాజు మధ్యలోనే డ్రాప్ అయ్యాడు అది వేరే విషయం. అయితే అప్పటి నుండి ఏ  సినిమాతో  బాలీవుడ్ జర్నీ బిగిన్ చేయాలా..? అనే ప్రాసెస్ లో ఉన్న ఈ బ్రాండ్ ప్రొడ్యూసర్ కి ఎట్టకేలకు మంచి రీమేక్ దొరికింది.

‘ఎవడు’ బాలీవుడ్ రిమేక్ కి సన్నాహాలు బిగిన్ అయ్యాయి. ఈ సినిమాని తెలుగులో నిర్మించింది కూడా దిల్ రాజు నే. అయితే ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో పార్ట్ నర్ అవుతున్నాడు దిల్ రాజు. బాలీవుడ్ భారీ సినిమాల నిర్మాత నిఖిల్ అద్వానీ తో కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నాడు దిల్ రాజు.

 

బాలీవుడ్ లో తెలుగు సినిమా రీమేక్ కి భారీ క్రేజ్ ఉంది. ఈ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు దిల్ రాజు. రీసెంట్ గా దర్శకుడు మిలాప్ జవేరి ‘ఎవడు’ సినిమాని చూసి, బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు కొని చేంజెస్ కూడా ప్లాన్ చేసుకున్నాడట.

 

‘ఇండియన్ 2’ లా కాకుండా ఈ రీమేక్ మాత్రం అన్ని విధాల పాజిటివ్ గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా గనక కలిసొచ్చి సక్సెస్ అందుకుందంటే అనుమానం లేదు.. దిల్ రాజు హవా బాలీవుడ్ లో కూడా బిగిన్ అయినట్టే. ఈసారి దిల్ రాజు ప్లాన్ పక్కా వర్కవుట్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.