దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల

Sunday,June 17,2018 - 10:12 by Z_CLU

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న `శంభో శంక‌ర`. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు, రెండు పాటలకు విశేష స్పందన లభించింది.. విడుదలైన 3 రోజులకే 30 లక్షల వ్యూస్ ను పొంది ఇప్పటికీ 40లక్షలకు పైగా చేరుకుంది…

అమలాపురంలో ప్రముఖ నిర్మాత  దిల్ రాజు  ‘గుచ్చుకున్నావే’ అనే 3వ పాటను ఆవిష్కరించారు.. ఈ చిత్రంలో ఈ పాటే హైలెట్ గా నిలవనుంది.. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. శంకర్ ఒక కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు.. అప్పటినుంచే ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఈ స్థాయికి చేరుకున్నారు… హీరోగా కూడా తాను రాణిస్తాడాని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా… పాటలు చాలా బాగున్నాయి.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు..

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న శంభో శంకర చిత్రాన్ని ఈ నెలాఖరు న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియచేసారు..