ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడింది

Saturday,July 22,2017 - 05:00 by Z_CLU

ధనుష్ నటించిన వీఐపీ-2 సినిమా వాయిదా పడింది. లెక్కప్రకారం ఈ నెలాఖరుకు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాను ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్ రజనీకాంత్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అనివార్య కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నామని మాత్రమే ప్రకటించారు.

రజనీకాంత్ మరో కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకురాలు. ఈ మూవీపై ధనుష్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తెలుగులో వీఐపీ సినిమా రఘువన్ బీటెక్ పేరిట విడుదలైంది. టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. ఈసారి మాత్రం దీన్ని వీఐపీ-2గానే రిలీజ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా సైమల్టేనియస్ గా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే హిందీలో కూడా ధనుష్ కు క్రేజ్ ఉంది. పైగా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఇందులో లేడీ విలన్ గా కనిపించనుంది. సినిమా ప్రచారాన్ని కూడా భారీగా స్టార్ట్ చేశారు. ఇంతలోనే వీఐపీ-2 వాయిదాపడింది.