#Akhil5 - పదేళ్ళ తర్వాత కలుస్తున్నారు

Friday,September 11,2020 - 01:21 by Z_CLU

కొన్ని హిట్ కాంబినేషన్లు ఎప్పుడో గానీ సెట్ అవ్వవు. ఇప్పుడు సురేందర్ రెడ్డి , దేవి శ్రీ ప్రసాద్ కాంబో కూడా చాలా గ్యాప్ తర్వాత కలిసి ఓ ఆల్బం డెలివరీ చేయనుంది. అవును #Akhil5 సినిమా కోసం వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారు. స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటివలే ఎనౌన్స్ అయింది. ఈ సినిమాకు మ్యూజిక్ బాధ్యతలు దేవి శ్రీ ప్రసాద్ కి అప్పగించనున్నారు. త్వరలోనే మేకర్స్ నుండి దేవి మ్యూజిక్ గురించి ప్రకటన రానుంది.

Surender Reddy-DeviSri కాంబినేషన్ లో ‘Oosaravelli’ వచ్చింది. సినిమా ఆశించిన విజయం అందుకోకపోయినా ఆల్బం మాత్రం మంచి ఆదరణ పొందింది. అప్పట్లో ఎక్కడ విన్నా ఆ సినిమా పాటలే వినిపించేవి. ఆల్బం అంతలా హిట్టయినప్పటికీ మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇప్పుడు AKHIL సినిమా కోసం కలుస్తున్నారు. ‘ఊసరవెల్లి’ విడుదలై వచ్చే ఏడాదికి సరిగ్గా పదేళ్ళవుతుంది. Akhil5 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గా పదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రేక్షకులకు ఈ కాంబో నుండి ఓ సూపర్ ఆల్బం రానుందన్నమాట.