మరికొన్ని గంటల్లో డీజే హంగామా షురూ

Thursday,June 22,2017 - 11:18 by Z_CLU

బన్నీ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ డీజే.. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో విడుదలకానుంది. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అటు ఓవర్సీస్ లో ఈరోజు నుంచే డీజే హంగామా షురూ కానుంది.

ఏపీ, తెలంగాణలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అటు అమెరికాలో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే క్లోజ్ అయింది. మరోవైపు తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో డీజే సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు యూనిట్ అంతా భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఫస్ట్ టైం బన్నీ తన సినిమా కోసం పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే విస్తృతంగా సినిమాకు ప్రమోషన్ చేపట్టిన అల్లు అర్జున్.. ఈరోజు బెంగళూరు, చెన్నైలో సినిమాకు ప్రచారం కల్పించబోతున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, నిర్మాతగా దిల్ రాజుకు 25వ చిత్రం కావడం విశేషం.