ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై కరోనా ఎఫెక్ట్

Tuesday,March 24,2020 - 02:19 by Z_CLU

ప్రభాస్ ప్రస్తుతం రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ పడింది. జార్జియాలో షెడ్యూల్ ను మధ్యలోనే ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మేటర్ ఇది కాదు. కరోనా ప్రభావం ప్రభాస్ నటించనున్న ఆ తర్వాత సినిమాపై కూడా పడింది.

అవును.. ప్రభాస్-నాగఅశ్విన్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమాపై కూడా కరోనా ప్రభావం పడినట్టే. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమాను స్టార్ట్ చేయాలని భావించాడు నాగఅశ్విన్. కానీ ఓ డియర్ లేట్ అవ్వడంతో.. ఇప్పుడా ఎఫెక్ట్ నాగఅశ్విన్-ప్రభాస్ మూవీపై పడింది

అశ్వనీదత్ నిర్మాతగా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే డైరక్టర్ నాగఅశ్వీన్ కు ఇప్పుడు మరింత టైమ్ దొరికినట్టయింది. ఈ గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ను మరింత పక్కాగా పూర్తిచేయబోతున్నాడు ఈ దర్శకుడు.