Saturday,September 17,2016 - 01:00 by Z_CLU

టాలీవుడ్ లో నాయికగా తొలి అవకాశం అందుకొని ఆ తరువాత తమ నటన తో వరుస సినిమాలతో దూసుకుపోతుంటారు కథానాయికలు. కానీ టాలీవుడ్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి ‘యమ దొంగ’ లో ఓ ప్రత్యేక పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మమతామోహన్ దాస్ మాత్రం ఇందుకు మినహా. కథానాయికగా నటిస్తూనే ప్రత్యేక పాత్రలతో కూడా అలరించిన ఈ ముద్దుగుమ్మ కొంత కాలం గా టాలీవుడ్ లో కనుమరుగైంది.

‘యమదొంగ’ తరువాత నాగార్జున, విష్ణు కలయిక లో వచ్చిన ‘కృష్ణార్జున’ లో కథానాయికగా కనిపించిన మమతా ‘విక్టరి’, ‘హోమం’ చిత్రాలలో కూడా నాయికగా అలరించింది. వీటి తో పాటు ‘చింతకాయల రవి’, ‘కింగ్’ సినిమాలో ప్రత్యేక పాత్రలు చేసిన ఈ మలయాళ కుట్టి ‘కేడి’ లో నాగ్ సరసన కథానాయికగా నటించింది. ఈ చిత్రం మమతా కు తెలుగు లో ఆఖరి చిత్రం. కేడి తరువాత మరో అఫర్ లేకపోవడం తో టాలీవుడ్ కు దూరమైన ఈ భామ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో మలయాళం లో దూసుకుపోతుంది. తాజాగా మమ్ముట్టి ‘తొప్పిల్ జొప్పన్’ తో పాటు ‘బేబీ సిట్టర్’ అనే సినిమాలతో మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మలయాళీ భామ మళ్ళీ టాలీవుడ్ లో రి ఎంట్రీ ఇచ్చేదెప్పుడో ?