మహానటి మరోసారి నిరూపించింది

Wednesday,May 09,2018 - 03:54 by Z_CLU

సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మహానటి. కంప్లీట్ టాలీవుడ్ ఇమోషనల్ మోడ్ లో ఉంది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సావిత్రి బయోపిక్. కరెక్ట్ కంటెంట్ ఉండాలే కానీ రన్ టైమ్ కి, సినిమా సక్సెస్ కి ఏ మాత్రం సంబంధం లేదని మరోసారి నిరూపించింది మహానటి. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 56 నిమిషాలు.

గతంలో రిలీజైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా ఈ బ్యారియర్ ని బ్రేక్ చేసింది. ఏకంగా 3 గంటల 11 నిమిషాలు ఉన్న ఈ సినిమా (యాడ్ చేసిన సన్నివేశాలతో కలుపుకొని) భారీ సక్సెస్ ని అందుకుంది. రీసెంట్ గా రిలీజైన రంగస్థలం కూడా 2 గంటల 55 నిమిషాలుంటే మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ 2 గంటల 53 నిమిషాలు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసినవే.

సినిమా నిడివి తక్కువగా ఉంటే సక్సెస్ రేషియో తక్కువగా ఉంటుంది అని చెప్పలేం కానీ, అనుకున్న ఇమోషన్ ని సరిగ్గా కన్వే చేయడానికి రన్ టైమ్ తో సంబంధం లేదు అని మరోసారి నిరూపించింది మహానటి.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ పర్ఫామెన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మిక్కీ. జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని స్వప్నదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు.