'చుట్టాలబ్బాయి' ను బాగా ఆదరిస్తున్నారు - చిత్ర యూనిట్

Tuesday,August 30,2016 - 10:40 by Z_CLU

 

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’ చిత్రం . విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని ఈ విజయంతో తమకు చాలా సంతోషం కలుగుతుందని యూనిట్ సభ్యులు అన్నారు.
ఇటీవలే ‘చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంగా…
దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ “టైటిల్ పెట్టిన దగ్గరనుండి మంచి ఆదరణ లభించింది. విడుదల తరువాత కూడా అలంటి ఆధారణే లభిస్తుండడం మా యూనిట్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తిరుపతిలో థియేటర్ కి వెళ్ళినప్పుడు హౌస్ ఫుల్ అవటంతో పాటు జనం కేరింతలు చప్పట్లతో ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారని అది చూసిన తర్వాత అంతవరకు నాలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది. తిరుపతి నుండి బయలుదేరిన మా యూనిట్ విజయ యాత్ర రాజంపేట, కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, విజయనగరం వరకు జరిగింది. అహ నా పెళ్ళంట, పూలరంగడు తరువాత ఎంతటి ఆనందం పొందానో చుట్టాలబ్బాయితో రెట్టింపు ఆనందాన్ని పొందాను.
నిర్మాతలు రాం వెంకట్ మాట్లాడుతూ “విజయ పథాన దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. తొలి చిత్రంతోనే విజయాన్ని పొందటం మూడో వారంలో కూడా కలెక్షన్స్ రావటం తాము ఊహించలేదన్నారు. మరిన్ని క్వాలిటీ చిత్రాలను నిర్మించేందుకు మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ” ఈ సక్సెస్ ను డిస్ట్రిబ్యూటర్ గా బాగా ఎంజాయ్ చేస్తున్నానని మొదట్లో తక్కువ థియేటర్లు వేసినా తరువాత థియేటర్ల సంఖ్య పెరిగిందని ఆది కెరీర్ కు ఇదో మలుపుగా భావిస్తున్నానని” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయి కుమార్, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, రైటర్ భావాన్ని, కెమెరామెన్ అరుణ్ తదితర చిత్ర బృందం పాల్గొన్నారు.