చిత్రలహరి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డీటెయిల్స్

Friday,April 05,2019 - 01:21 by Z_CLU

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రలహరి. సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు. గతంలో ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ సినిమాల్ని తీసింది ఇతడే. చిత్రలహరిలో తేజూ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని 3 పాటల్ని ఇప్పటికే విడుదల చేశారు. ఏప్రిల్ 12న థియేటర్లలోకి రాబోతోంది చిత్రలహరి.