Republic Movie - మెగాస్టార్ చేతుల మీదుగా ట్రయిలర్ లాంఛ్
Tuesday,September 21,2021 - 06:29 by Z_CLU
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడీ ప్రచారంలో భాగం కానున్నారు. రిపబ్లిక్ మూవీ ట్రయిలర్ ను చిరంజీవి లాంఛ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు, రిపబ్లిక్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు మెగాస్టార్.
దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది రిపబ్లిక్ మూవీ. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సాయితేజ్. చాన్నాళ్ల కిందటే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ రోడ్డు యాక్సిడెంట్ అవ్వడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. దీంతో సాయితేజ్ కోసం చిరంజీవి, పవన్ రంగంలోకి దిగారు. రిపబ్లిక్ సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేయబోతున్నారు. చిరంజీవి ట్రయిలర్ లాంచ్ చేస్తారు.. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది.
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ను పొందింది. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, కాలేజ్ సాంగ్తో పాటు జోర్ సే.. సాంగ్కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics