Chiranjeevi is the Indian film personality of the year 2022
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఆయనను వరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా కేంద్రం ఈ ప్రకటన చేసింది.
4 దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు చిరంజీవి. 150కి పైగా సినిమాలతో నటుడిగా, నిర్మాతగా మెప్పిస్తూనే, ఛారిటీ కార్యక్రమాలతో అందరివాడు అనిపించుకున్నారు. ఈ అవార్డుకు చిరంజీవి పూర్తిస్థాయిలో అర్హుడని టాలీవుడ్ అంతా అభిప్రాయపడుతోంది. (Indian film personality of the year 2022)
గత ఏడాది ఈ అవార్డును సీనియర్ నటి హేమమాలిని అందుకున్నారు. ఇప్పుడు ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును అందుకోవడం గమనార్హం.
తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి టైమ్ ను సినిమాలకే కేటాయించారు. సినీ రంగంలోనే ఆయన కొనసాగుతారు.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics