మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ షూట్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఇటివలే కరోన సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 6 నుండి కోకాపేట్ లో వేసిన భారీ సెట్ లో సినిమా షూటింగ్ జరుపుకోనుంది.
సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయింది. కొంత ప్యాచ్ వర్క్ , పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే ఫైనల్ షెడ్యుల్ లో అవి పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టనున్నారు.
చిరు ఆచార్య అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించనున్నాడు. చిరు, చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటాయని ఆ సీన్స్ సినిమాకే హైలైట్ అని ఇన్సైడ్ టాక్. చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా కనిపించనున్నాడు.
మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ ఆల్బమ్ నుండి మొదటి పాటగా విడుదలైన లాహే లాహే పెద్ద హిట్టయింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా ఈ సాంగే వినబడుతుంది. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈసారి మేకర్స్ డ్యూయెట్ సాంగ్ వదలనున్నారని సమాచారం. షూటింగ్ పూర్తయిన వెంటనే భారీ ఎత్తున ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు.
ఇప్పటికే ప్రమోషన్ పై దృష్టి పెట్టి టీం వర్క్ చేస్తుంది. చిరు , చరణ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ లో సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics