తండ్రి కొడుకులతో....

Sunday,April 09,2017 - 10:00 by Z_CLU

ప్రస్తుతం ‘రాజు గారి గది-2’ సినిమాతో బిజీ గా ఉన్న నాగార్జున, కళ్యాణ్ కృష్ణ, మరిముత్తు కృష్ణ సినిమాలతో బిజీ గా ఉన్న నాగ చైతన్య త్వరలోనే ఒకే డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు..

లేటెస్ట్ గా చైతు తో ‘ప్రేమమ్’ సినిమాను రూపొందించి సక్సెస్ అందుకున్న చందు మొండేటి.. ఇప్పటికే నాగ్ కోసం ఒక స్టోరీ రెడీ చేసి త్వరలోనే ఆ సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతూనే మరో వైపు చైతు తో కూడా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ ఇద్దరి కోసం కథలు కూడా రెడీ చేసిన చందు నాగార్జున తర్వాత చైతు తో సినిమాను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడట. అంటే తండ్రి కొడుకులతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ అక్కినేని డైరెక్టర్స్ లిస్ట్ లో చేరబోతున్నాడన్నమాట చందు..