చైతు,నిఖిల్ ఒకే రోజు వస్తారా..?

Sunday,April 16,2017 - 03:00 by Z_CLU

ప్రస్తుతం బాహుబలి ఏప్రిల్ 28 న రిలీజ్ కి అవుతుండడంతో యంగ్ హీరోలు తమ సినిమాలను మే కి షిఫ్ట్ చేసుకునే పనిలో పడ్డారు.. ఇప్పటికే అల్లు అర్జున్ మే నుంచి తప్పుకొని జులై కి వెళ్లడంతో ఇక మే లో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు యంగ్ హీరోస్..

ఇప్పటికే నాగ చైతన్య తన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను మే 19 ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు నిఖిల్ కూడా అదే డేట్ పై కన్నేశాడు.. నిఖిల్ లేటెస్ట్ సినిమా ‘కేశవ’ ను మే మొదటి వారంలోనే రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ ప్రెజెంట్ ఆ ఆలోచనను మానుకొని మే 19కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంటే చైతు-నిఖిల్ ఇద్దరు ఒకే రోజు డిఫరెంట్ జోనర్స్ తో థియేటర్స్ లో సందడి చేస్తారన్నమాట..