మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ...

Sunday,November 12,2017 - 01:15 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.. ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ సినిమా సెట్స్ పై ఉన్న చైతూ త్వరలోనే మారుతి తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు చైతూ మరో సినిమా కూడా సెట్ చేసేసుకున్నాడనే వార్త వినిపిస్తుంది.

‘ఉయ్యాల -జంపాల’,’మజ్ను’ వంటి లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విరించి వర్మ తో త్వరలోనే ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట చైతూ.. ఇప్పటికే చైతూ కోసం విరించి ఓ క్యూట్ లవ్ స్టోరీ రెడీ చేసి నాగ్ కి వినిపించాడని, నాగ్ తో పాటు చైతూ కి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో విరించి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తుంది. మారుతితో సినిమా పూర్తయ్యాక చైతూ చేయబోయే సినిమా ఇదే అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది.