ఆది నుంచి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్

Monday,May 06,2019 - 11:47 by Z_CLU

తెలుగు సినిమాలో కొత్త కథల ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. కాకపోతే కొంతమంది హీరోలు మాత్రమే అలాంటివి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆది సాయికుమార్ కూడా కొత్తగా ట్రై చేశాడు. బుర్రకథ సినిమాలో ఆదిని సరికొత్తగా చూడొచ్చు. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే మేటర్ మొత్తం అర్థమైపోతుంది.

బుర్రకథ సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేయదలుచుకోలేదు మేకర్స్. టైటిల్ లోగోతోనే థీమ్ ఏంటనేది చెప్పేశారు. ఇక టీజర్ లో మేటర్ మొత్తం రివీల్ చేశారు. రెండు బ్రెయిన్స్ ఉన్న హీరో చేసిన అల్లరే ఈ బుర్రకథ. ఏ బ్రెయిన్ యాక్టివేట్ అయితే అలా ప్రవర్తిస్తుంటాడన్నమాట.

మాటల రచయిత డైమండ్ రత్నం ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఆది తండ్రిపాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తున్నాడు. టీజర్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. మరీ ముఖ్యంగా క్యారెక్టర్లన్నీ కామెడీ పండించాయి. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్, కిషోర్ ఈ సినిమాను నిర్మించారు.