బన్నీ మొదలెట్టేసాడు..
Monday,August 29,2016 - 01:20 by Z_CLU
తాజాగా ‘సరైనోడు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో కొందరు దర్శకులతో బన్నీ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించినప్పటికీ హరీష్ శంకర్ కె ఓటు వేసాడు అల్లు అర్జున్. దిల్ రాజు నిర్మాణం లో హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందనున్న ఈ చిత్రానికి `డి.జె..దువ్వాడ జగన్నాథమ్` అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర యూనిట్. ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – ఆర్య సినిమా నుండి అల్లుఅర్జున్తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ కోరిక తీరింది. డి.జె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా రెగ్యులర్ సెప్టెంబర్ నుండి జరుగుతుంది. అలాగే సినిమాను ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం” అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ ”ఆర్య, పరుగు తర్వాత బన్నితో నిర్మిస్తున్న మూడో చిత్రమిది. మా బ్యానర్కు ఇది 25వ సినిమా. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందాని ఆశిస్తున్నా. హరీష్ శంకర్తో గబ్బర్ సింగ్ నుండి మంచి పరిచయం ఏర్పడింది. మా బ్యానర్ లో హరీష్ తో వరుస సినిమాలు చేస్తున్నాం. హరీష్ దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా. తప్పకుండా మంచి హిట్ సినిమాను రూపొందించేలా అందరం కష్టపడి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్ప్లే: దీపక్ రాజ్ నిర్మాత: దిల్రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.