'మహానటి' దర్శకుడితో ప్రభాస్ సినిమా !

Wednesday,February 26,2020 - 01:22 by Z_CLU

‘బాహుబలి’ ప్రాంచైజీతో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న ప్రభాస్ , ‘మహానటి’ లాంటి క్లాసిక్ సినిమాను అందించిన నాగ్ అశ్విన్ కలిసి సినిమా చేస్తే ..? అవును ఈ కాంబోలో త్వరలోనే సినిమా తెరకెక్కబోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

 

మొన్నటి వరకూ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ నడిచింది. ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులంతా ఈ కాంబో ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? అంటూ వెయిట్ చేస్తున్నారు ? మరి నాగ్ అశ్విన్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో, ఎలాంటి కథతో సినిమా తీస్తాడో చూడాలి.