చేతిలో 2 రీమేక్స్.. ఓటు దేనికి?

Monday,March 23,2020 - 04:46 by Z_CLU

తెలుగు సినిమా రీమేక్స్ కు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డికి రీమేక్ గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మరోసారి తెలుగు రీమేక్స్ కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా తెలుగులో వచ్చిన రెండు సినిమాల రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. వాటిలో ఒకటి డియర్ కామ్రేడ్ కాగా, రెండోది భీష్మ.

ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాను ఓ స్టార్ హీరోతో రీమేక్ చేయాలనేది కరణ్ జోహార్ ఆశ. తను నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ, మరో యంగ్ డైరక్టర్ కు ఆ ప్రాజెక్టు అప్పగించాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా హీరో రణబీర్ కపూర్ ను కలిశాడు కరణ్ జోహార్. డియర్ కామ్రేడ్, భీష్మ సినిమాల రీమేక్ ఆఫర్ ఇచ్చాడు.

ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల రీమేక్స్ రణబీర్ కపూర్ దగ్గర ఆగాయి. వాటిలోంచి ఒకటి రణబీర్ సెలక్ట్ చేయాల్సి ఉంది. రణబీర్ కు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా రీమేక్ తో సెట్స్ పైకి వెళ్లాలనేది కరణ్ ఆలోచన. ఒకవేళ రణబీర్ కు రెండు సినిమాలూ నచ్చకపోతే, అప్పుడు మరో హీరోను ఈ రెండు సినిమాలతో సంప్రదిస్తాడు కరణ్.