మ‌హిళ‌ల‌తో సినిమా చూడ‌నున్న "భాగ‌మ‌తి"

Sunday,February 04,2018 - 01:01 by Z_CLU

క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం విడుద‌ల‌య్యి ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతుంది. ఓ మ‌హిళ త‌న‌కొచ్చిన స‌మ‌స్య ద‌గ్గ‌రే ఆగిపోకుండా త‌న స‌మ‌స్య‌ని ఎదుర్కోని ప‌దిమందికి ఎలా వుప‌యోగ‌ప‌డింది అనే కాన్సెప్ట్ తో సౌత్ ఇండియాలో విజ‌ఢంకా మెగిస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి అత్య‌ధికంగా మ‌హిళా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎక్కువుగా వుండ‌టం విశేషం. ఈ విష‌యం తెలుసుకున్న టాలీవుడ్ క్వీన్ అనుష్క మహిళా ప్రేక్ష‌కుల‌తో చిత్రాన్ని చూడాలని నిర్ణ‌యించుకున్నారు. చిత్రాన్ని వారితో చూసి వారికి థ్యాంక్స్ చెప్పాల‌ని నిర్ణయించుకున్నారు. 

 

భాగ‌మ‌తి పర్యటించనున్న అడ్డాలు….

సోమ‌వారం నాడు… 

విజ‌య‌వాడ – రాజ్ ధియెట‌ర్‌(మార్నింగ్ షో).  

ఏలూరు- మిని స‌త్య‌నారాయ‌ణ (మ్యాట్ని), 

రాజ‌మండ్రి- స్వామి (మెద‌టి ఆట‌) 

భాగ‌మ‌తి చిత్రాన్ని చూసి ఆశీర్వ‌దించిన మ‌హిళా లోకానికి త‌న వంతుగా థ్యాంక్స్ చెప్ప‌టానికి అనుష్క వస్తోంది. ఇది కేవ‌లం మ‌హిళా ప్రేక్ష‌కుల‌కి మాత్ర‌మే.