మరో షెడ్యూల్ ఫిక్స్ చేసిన నటసింహం

Friday,October 20,2017 - 04:04 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను 79 రోజుల్లో పూర్తిచేశాడు బాలయ్య. పైసా వసూల్ సినిమాను 78 రోజుల్లో పూర్తిచేశాడు. ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను అంతకంటే తక్కువ టైమ్ లో పూర్తిచేయాలనేది బాలయ్య టార్గెట్. అందుకే వీలైనన్ని ఎక్కువ కాల్షీట్లు కేటాయిస్తున్నాడు. నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్లయిమాక్స్ పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన బాలకృష్ణ.. మరో షెడ్యూల్ కు సై అంటున్నాడు.

ఈనెల 23 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. వైజాగ్ లో 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొత్త షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చే మరికొన్ని సీన్స్ తీయబోతున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనేది ప్లాన్. కానీ అంతకంటే ముందే సినిమా సిద్ధమైపోతుంది.