బాలయ్య-పూరి సినిమా అప్డేట్స్

Tuesday,May 02,2017 - 02:32 by Z_CLU

నటసింహం బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోయే దర్శకుడు పూరి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేశాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో బాలయ్య పై “గుండెల్లో గోలీ సోడా” అనే మాస్ సాంగ్ షూట్ చేస్తున్న యూనిట్ ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసి షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పాలనుకుంటోంది. త్వరలోనే పోర్చుగల్ లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.. పోర్చుగల్ లో దాదాపు 40 రోజులు పాటు జరగనున్న ఈ షెడ్యూల్ ఓ మూడు పాటలతో పాటు ఫైట్స్, అలాగే ఓ హెలికాఫ్టర్ ఛేజ్ ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. పోర్చుగల్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో మరో 10 రోజుల పాటు పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు యూనిట్.

గ్యాంగ్ స్టర్స్ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి సెప్టెంబర్ 29 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్….