#Narthanasala - బాలయ్య దసరా కానుక

Monday,October 19,2020 - 06:13 by Z_CLU

నర్తనశాల.. బాలయ్య దర్శకుడిగా మారిన సినిమా. అయితే స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సినిమా ఆగిపోయింది. అలా ఆగిపోయిన నర్తనశాల సినిమాను ఇప్పుడు విడుదల చేయబోతున్నాడు బాలయ్య.

అప్పట్లో సినిమాకు సంబంధించిన ఫూటేజ్ ను ఎడిట్ చేస్తే 17 నిమిషాల విజువల్స్ వచ్చాయి. వాటినే ఓ వీడియోగా మార్చి, రీ-రికార్డింగ్ చేసి ఈ దసరాకు రిలీజ్ చేయబోతున్నారు. 24వ తేదీ నుంచి ఓ ATT (ఎనీ టైమ్ థియేటర్) సంస్థలో ఈ వీడియోను చూడొచ్చు. ఈ మూవీ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఛారిటీకి ఇవ్వబోతున్నాడు బాలయ్య.

బాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి నటించారు. యాక్సిడెంట్ లో సౌందర్య మరణించిన తర్వాత సినిమా ఆగిపోయింది.