యాగం మొదలు పెట్టిన బాలకృష్ణ..
Thursday,September 08,2016 - 07:00 by Z_CLU
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం మధ్యప్రదేశ్లో చిత్రీకరణ జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు యూనిట్. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని తన పేరుని గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది అని ప్రకటించారు. అప్పటి నుండి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు.
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుత షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకు మధ్య ప్రదేశ్ లో జరగనుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ తదితరలు నటిస్తున్నారు.