బాలయ్య ట్రిపుల్ ధమాకా

Friday,August 04,2017 - 12:57 by Z_CLU

K.S. రవి కుమార్ డైరెక్షన్ లో నిన్ననే షూటింగ్ బిగిన్ చేసుకున్న సినిమా ఫుల్ స్వింగ్ లో ఉంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నయనతారతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో పూరి సినిమాలోను శ్రియ తో పాటు కైరా దత్ ముస్కాన్ లు నటించారు. ఇప్పుడు ఈ సినిమాలోను ముగ్గురు హీరోయిన్స్ అనే టాక్ రావడం, న్యాచురల్ గానే డిస్కషన్స్ కి స్పేస్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ టాక్ నిజమా కాదా…? నిజమే అయితే ఆ మరో ఇద్దరు హీరోయిన్స్ ఎవరై ఉంటారు..? లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.