బాలకృష్ణ తో మలయాళ బ్యూటీ....

Monday,September 04,2017 - 02:06 by Z_CLU

‘పైసా వసూల్’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మలయాళ బ్యూటీ నటషా దోషి ను సెలెక్ట్ చేశారు యూనిట్.

మలయాళంలో ‘హైడ్ ఎన్ సీక్’,’మంత్రికన్’,’నయన’ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న నటషా ఈ రోల్ కి పర్ఫెక్ట్ అని భావించిన యూనిట్ ఈ భామ ను సినిమాకు తీసుకున్నారట. ఇక బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్న ఈ సినిమాలో మూడో హీరోయిన్ ను కూడా త్వరలోనే సెలెక్ట్ చేసే పనిలో పడ్డారట యూనిట్.