ఈ రోజే బాలయ్య ‘జై సింహా’ టీజర్ రిలీజ్

Thursday,December 21,2017 - 12:55 by Z_CLU

బాలయ్య ‘జై సింహా’ టీజర్ ఈ రోజు సాయంత్రం 7:10 నిమిషాలకు రిలీజ్ కానుంది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజు సాయంత్రం నుండి సోషల్ మీడియాలో మ్యాగ్జిమం  స్పేస్ ని ఆక్యు పై చేయనుంది.

 

 

ఇదే స్పీడ్ లో డిసెంబర్ 24 న ఈ సినిమా ఆడియోని విజయవాడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ‘పైసా వసూల్’ లాంటి మాస్ ఎంటర్ టైనర్ తరవాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి.

 

బాలయ్య సరసన నయనతారతో పాటు నటాషా జోషి, హరిప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా K.S. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కింది. చిరాంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. C. కళ్యాణ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.