2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన జై సింహా టీజర్

Saturday,December 23,2017 - 10:03 by Z_CLU

K.S. రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది బాలయ్య ‘జై సింహా’ సినిమా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా, ఫాస్ట్ పేజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోవైపు నిన్న రిలీజైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

బాలయ్య మార్క్ డైలాగ్స్ తో బిగిన్ అయ్యే ‘జై సింహా’ టీజర్ ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని రెండింతలు పెంచేసింది. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన టీజర్ గంట గంటకి వ్యూస్ పెంచుకునే పనిలో ఉంది. సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్న ఈ టీజర్ కి క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే, ఫ్యాన్స్ లో ఈ సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయిందో తెలుస్తుంది.

 

చిరాంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతారతో పాటు నటాషా, హరిప్రియలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. C.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై C. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.