టాకీపార్ట్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య ‘జై సింహా’

Friday,December 01,2017 - 04:47 by Z_CLU

K.S. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలయ్య ‘జై సింహా’ ఫాస్ట్ పేజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తో సక్సెస్ ఫుల్ గా టాకీపార్ట్ కి ప్యాకప్ చెప్పేసింది. రామోజీ    ఫిల్మ్ సిటీలో  వేసిన భారీ  సెట్ లో బాలయ్య, ఆశుతోష్  ఖురానా  కాంబినేషన్ లో 60  మంది ఫైటర్స్  తో  తెరకెక్కిన ఈ ఫైట్ ని రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు.

 

పైసా వసూల్ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత బాలయ్య ఒరిజినల్ మార్క్ స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై బిగినినింగ్ నుండే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. రీసెంట్ గా రిలీజైన టైటిల్ లోగో పోస్టర్ ఫ్యాన్స్ లో ఈ మూవీ డిమాండ్ ను మరింత పెంచేసింది.

 

 

సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతారతో పాటు నటాషా జోషి,  హరిప్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంతాన్ భట్ మ్యూజిక్ కంపోజర్. C.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై C. కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.