అవార్డు దర్శకుడు.... మళ్ళీ కొత్త వాళ్ళతో

Sunday,June 23,2019 - 03:20 by Z_CLU

గతేడాది వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించి మంచి సినిమా అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా కి గుర్తింపు తో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మళ్ళీ ఓ మంచి కథతో రాబోతున్నాడట.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన వెంకటేష్ ప్రస్తుతం నటీ నటుల ఎంపిక మొదలుపెట్టాడు. ఈ సినిమాను కూడా కొత్త వాళ్ళతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇందులో కొంత మంది పరిచయమున్న నటులు కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమాను మరీ కంచరపాలెంలా రియలిస్టిక్ గా కాకుండా కాస్త సినిమాటిక్ గా ప్లాన్ చేసుకుంటున్నాడట దర్శకుడు.

కేరాఫ్ కంచరపాలెం నిర్మాత ప్రవీణనే ఈ సినిమాను కూడా నిర్మించనుందట. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాతో వెంకటేష్ మహా , నిర్మాత ప్రవీణ మళ్ళీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో..చూడాలి.