రజిని అభిమానులకు విజ్ఞప్తి

Monday,July 18,2016 - 11:14 by zdcl

 

సూపర్ స్టార్ రజిని నటించిన ‘కబాలి’ చిత్రం విడుదలకి సిద్ధమైంది. ఈ నెల 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే తన నటించిన రెండు సినిమాలతో ప్రేక్షకుల అలరించలేకపోయిన రజిని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడతాడని అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకి ముందే హాట్ టాపిక్ గా మారింది. చెన్నై లో రజిని సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులకి ఓ పెద్ద పండగే. అయితే ఆ రోజు థియేటర్స్ వద్ద సూపర్ స్టార్ అభిమానులు భారీ స్థాయిలో పాలాభిషేకం కూడా చెయ్యడం సహజమే. అయితే ఈ సారి మాత్రం రజిని అభిమానులు ఇలా పాల ను వృధా చెయ్యడం పై కాస్త అసంపృప్తి నెలకుంటుంది. ఇక జులై 22 న కబాలి విడుదల సందర్భంగా రజిని ఫ్యాన్స్ దాదాపు 20 లక్షల తో 50 లీటర్ల పాలాభిషేకం చేసే అవకాశం ఉందని తెలుస్తుండడం తో ఇలా ఇన్ని లీటర్ల పాలను వృధా చెయ్యడం సమన్యాసం కాదని పైగా సేవా కార్యక్రమాల లో ముందుండే హీరో రజిని గురించి అభిమానాలు ఇలా వృధా చెయ్యడం అస్సలు సబబు కాదని అంటున్నాయి చెన్నై లోని కొన్ని ఉద్యోగ సంఘాలు. ఆ రోజున చెన్నై లోని నిరుపేదలకు రజిని పేరు తో ఆ పాల పాకెట్స్ ను దానం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. మరి రజిని అభిమానులను ఈ విజ్ఞప్తి ను ఎలా స్వీకరిస్తారో? చూడాలి.