`అర్జున్ సురవరం` వస్తున్నాడు
Thursday,November 14,2019 - 11:53 by Z_CLU
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని పవర్ ఫుల్ కంటెంట్తో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు.
నిఖిల్ కు జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టి.సంతోష్
సమర్పణ: ఠాగూర్ మధు
బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత: రాజ్కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి