కల్యాణ్ రామ్ నుంచి మరో రొమాంటిక్ మూవీ

Monday,March 19,2018 - 11:23 by Z_CLU

కల్యాణ్ రామ్ చేతిలో ఇప్పటికే 2 సినిమాలున్నాయి. ఎమ్మెల్యే సినిమాను విడుదలకు సిద్ధంచేసిన ఈ హీరో, జయేంద్ర దర్శకత్వంలో ‘నా నువ్వే’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ లవ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పుడు ఇదే ఫార్ములాలో మరో సినిమా ఓకే చేశాడు ఈ నందమూరి హీరో. త్వరలోనే విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్లు తీశాడు విరించి వర్మ. ఇప్పుడీ దర్శకుడు తమ మూడో ప్రయత్నంగా కల్యాణ్ రామ్ తో మరో చూడచక్కనైన లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

జయేంద్ర డైరక్షన్ లో చేస్తున్న నా నువ్వే సినిమాను మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే విరించి వర్మ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ గ్యాప్ లో మరో సినిమా కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు కల్యాణ్ రామ్.