త్వరలోనే ఆ మల్టీస్టారర్ సినిమా.....

Saturday,February 18,2017 - 06:28 by Z_CLU

టాలీవుడ్ లో కొన్ని మల్టీస్టారర్ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.. అందులో దగ్గుబాటి ఫామిలీ మల్టీస్టారర్ సినిమా కూడా ఒకటి. గతంలో వెంకటేష్, నాగ చైతన్య, రానాలతో ఓ సినిమా నిర్మించి ఆ సినిమాలో తను కూడా నటించాలనుకున్నారు నిర్మాత రామానాయుడు. అప్పట్లో ఆ సినిమా గురించి కొన్ని కథలు కూడా విన్నారు కూడా..


అనుకోకుండా ఆయన మరణించడంతో దగ్గుబాటి డ్రీం ప్రాజెక్ట్ అటకెక్కింది…అయితే రామానాయుడు గారి డ్రీం ప్రాజెక్ట్ కచ్చితంగా నిర్మిస్తానని, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన కథ కోసం చూస్తున్నానని, ఆ మల్టీస్టారర్ సినిమా త్వరలోనే ఉంటుందని లేటెస్ట్ గా అనౌన్స్ చేసాడు సురేష్ బాబు. రామానాయుడు గారి రెండవ వర్ధంతి సందర్భాంగా సురేష్ బాబు మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేశాడు. ఈ అనౌన్స్ మెంట్ తో దగ్గుబాటి ఫాన్స్ ఖుషీ అవుతూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూడటం మొదలెట్టేశారు. మరి ఈ దగ్గుబాటి మల్టీస్టారర్ ఎప్ప్పుడు సెట్స్ పైకి వస్తుందో…చూడాలి…